అవసర ట్రస్ట్ యొక్క Q1 2026 కార్యాచరణ ప్రణాళిక ఇవ్వబడింది!
ఆర్షవిజ్ఞాన అధునాతన అధ్యయనం మరియు భాషా పరిశోధన
సచ్ఛీల నిర్మాణం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఇంకా భారతీయ విలువలతో కూడిన సంప్రదాయాలకు ‘అవసర’ ఇస్తుంది ప్రోత్సాహం.
-
మా లక్ష్యం
వేదాధ్యయనం, సంస్కృత భాషా పరివ్యాప్తికి తోడ్పడడం; ప్రాచీన సాహిత్యానువాదం, ప్రచురణ ద్వారా అమూల్యమైన గ్రంథాలను, కావ్యాలను ముందు తరాలకు అందించడం, కళలను ప్రోత్సహించడం, విశ్వశ్రేయస్సును కాంక్షించి ఆధ్యాత్మిక -సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతరేతర అనుబంధ కార్యక్రమాలు, కార్యశాలలు నిర్వహించడం.
-
భావి తరాలకు చేయూత
పరిశోధనా అవకాశాలను మెరుగుపరచడం; సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా భవిష్యత్తరాలకు పండితులను, నాయకులను, సంస్కర్తలను అందజేయడం, సంప్రదాయ ఆవిష్కరణలు ప్రోత్సహించడం; భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ సంపదను పరిరక్షించడం.
-
సమాజ శ్రేయస్సు, అభివృద్ధి
సమస్త మానవాళికి ఉపయోగపడే విధంగా ఆలయాలు, వేద పాఠశాలల నిర్మాణ, నిర్వహణా కార్యక్రమాలు యథావకాశంగా నిర్వహించడం; సనాతన ధర్మ పరిశీలన, వైదిక వాఙ్మయ పరిరక్షణ, ప్రచారం, బోధన అందించే దిశగా విద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, గ్రంథాలయాలను ప్రోత్సహించడం.
-
భారతీయ సంస్కృతి, కళల వృద్ధి
పురాణ, ఇతిహాస, ఇతర సంప్రదాయ గ్రంథాల అధ్యయనం, ప్రచారం; తరగతులు, కార్యశాలలు, ఇతర కార్యక్రమాలను నిర్వహించి తద్వారా సంస్కృత, తెలుగు భాషల వ్యాప్తికి కృషిచేయడం.
డాక్టర్ అద్దంకి శ్రీనివాస్
(ట్రస్ట్ చైర్మన్)
డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ Ph.D.(తెలుగు), M.A. (తెలుగు), M.A. (సంస్కృతం), మరియు M.A (భాషాశాస్త్రం) - సుప్రసిద్ధ పండితులు, కవి, పరిశోధకులు. విద్యావేత్తగా, రచయితగా, సంపాదకునిగా కృషిచేస్తున్న వారు. తెలుగు భాష, వ్యాకరణం, శాస్త్రీయ కవిత్వం, తులనాత్మక సాహిత్యం, సాహిత్య విమర్శ, భాషాశాస్త్రం మరియు అనువాదానికి సంబంధించిన అంశాలలో వారు అనేక రచనలు చేశారు.
వారు భారతీయ సనాతన ధర్మం, మహాభారతం, రామాయణం, భాగవతం, శ్రీరామకర్ణామృతం, ఉత్తరరామాయణం, కేయూరబాహుచరిత్ర, చారుచర్య, విజ్ఞానేశ్వరము మొదలైన అనేక గ్రంథాలు రచించారు. ఇవన్నీ ఆర్షవిజ్ఞానాన్ని అందులోని గొప్పతనాన్ని ప్రకటించేవే. వీరు తమ ప్రసంగాల ద్వారా కూడా భాషాసాహిత్యాలకు సేవ చేస్తున్నారు.
వారి సేవలకు గుర్తింపుగా, వారు 2019లో ప్రతిష్ఠాత్మకమైన మహర్షి బాదరాయణ్ వ్యాస్ సమ్మాన్ అవార్డు (క్లాసికల్ తెలుగులో ప్రెసిడెంట్ అవార్డు) పొందారు. నవభారత రత్న, కవిరత్న, మరియు వేగావతి వీరి ఇతర బిరుదులు.
వారి రచనలు ఇప్పటిదాకా 90 కి పైగా ప్రచురించిన పుస్తకాలు వెలుగు చూశాయి. ఇంకా 500 కంటే ఎక్కువ వ్యాసాలు ఉన్నాయి.
ఈ రోజే అవసర ట్రస్టుకు విరాళాలు ఇవ్వండి
అవసరార్థుల అవసరం తీర్చడమే మా ‘అవసర’ ప్రధాన లక్ష్యం. ఉదారమైన మీ సహకారం మా లక్ష్యసాధనను సులభతరం చేసి, మరింత ఉత్సాహాన్నిచ్చి ముందుకు సాగే బలాన్ని ఇస్తుంది. మీ సహాయం ఎన్నో జీవితాలలో ఎన్నెన్నో మార్పులను తీసుకురాగలదు. వైదిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడడంలో మాకు ఇతోధిక సహాయం చేయగలదు. అంతేకాక శాశ్వతమైన విలువలను ప్రచారం చేసే గ్రంథాల రూపంలోనూ, కార్యక్రమాల రూపంలోనూ, చిరకాలం లోకంలో జ్ఞానదానం చేయగలదు.
విరాళాలు